తెలంగాణ

telangana

ETV Bharat / state

చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర

ఆగస్టు 11న జరిగే ఎస్​టీయూ రాష్ట్ర మహాసభల కరపత్రాన్ని హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలో ఏఐఎఫ్​టీయూ ప్రతినిధులు విమలక్క తదితరులు ఆవిష్కరించారు.

By

Published : Jul 11, 2019, 11:47 PM IST

చుక్కారామయ్య

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రంగ చట్టాలను కార్పోరేట్ రంగానికి అనుగుణంగా మార్చడానికి అనేక మార్గాలు ఆలోచిస్తోందని శాసనమండలి మాజీ సభ్యులు చుక్కారామయ్య ఆరోపించారు. ఏఐఎఫ్​టీయు 28 వార్షికోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 11న జరిగే ఎస్​టీయూ రాష్ట్ర మహాసభల కరపత్రాన్ని హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలో ఏఐఎఫ్​టీయూ ప్రతినిధులు విమలక్క తదితరులు ఆవిష్కరించారు. కేంద్రం పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేయడానికి చట్టాలను మార్పు చేస్తోందని చుక్కరామయ్య ఆరోపించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఏఐఎఫ్​టీయూ చేస్తున్న కృషిని కొనియాడారు. ఆయా హక్కుల కోసం రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

స్​టీయూ రాష్ట్ర మహాసభల కరపత్రం విడుదల

ABOUT THE AUTHOR

...view details