తెలంగాణ

telangana

ETV Bharat / state

దొంగల హల్​చల్​

ఎస్​.ఆర్​ నగర్​ పరిధిలోని ఓ అపార్ట్​మెంటులో దొంగలు చొరబడి నాలుగున్నర లక్షల విలువైన బంగారు నగలు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని కూరగాయలు కొనేందుకు మార్కెట్​కు వెళ్లి వచ్చేంతలోపే కేడీగాళ్లు ఇళ్లు దోచేశారు.

By

Published : Mar 5, 2019, 4:50 AM IST

Updated : Mar 5, 2019, 7:27 AM IST

దొంగల హల్​చల్​

20 నిమిషాల్లో దోచేశారు

ఎస్​.ఆర్. నగర్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్​నగర్​లో దొంగలు రెచ్చిపోయారు. కౌసల్య అపార్ట్​మెంట్​లో చొరబడి నాలుగున్నర లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అపార్ట్​మెంటులోని 203 నంబర్​గల ఇంట్లో రవిశంకర్​ శర్మ నివాసముంటున్నారు. సోమవారం సాయంత్రం కూరగాయల కోసం మార్కెట్​కు వెళ్లాడు. తిరిగొచ్చేసరికి ఇంట్లో బీరువా తెరచి ఉంది. అందులో బంగారు నగలను అపహరించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

20 నిమిషాల్లోనే దోచేశారు..

కూరగాయలకు వెళ్లొచ్చిన 20నిమిషాల వ్యవధిలోనే దొంగతనం జరిగిందని తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆధారాలు సేకరిస్తున్నారు.

ఇవీ చూడండి:బాధ్యతలు పక్కాగా నిర్వహిస్తాం

Last Updated : Mar 5, 2019, 7:27 AM IST

ABOUT THE AUTHOR

...view details