హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని ప్రగతినగర్లో అర్ధరాత్రి చిరుతపులి కలకలం రేపింది. ప్రగతినగర్ గీతాంజలి పాఠశాలలోని మొదటి అంతస్తులోని ఓ గదిలో చిరుతపులి చిక్కుకుంది. పాఠశాల నుంచి అర్ధరాత్రి చిరుతపులి అరుపులు వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రగతినగర్లో చిరుత కలకలం
మహానగరంలో అర్ధరాత్రి చిరుత సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ప్రగతినగర్ ఓపాఠశాలలోని మొదటి అంతస్తు గదిలో చిరుత అరుపులు విన్న స్థానికులు అటవీశాఖ, పోలీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
ప్రగతినగర్లో చిరుత కలకలం
సమాచారం అందుకున్న అటవీశాఖ, పోలీస్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే పాఠశాలలో రాత్రి విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ చిరుతపులి అరుపులకు భయపడి పాఠశాలలోనే ఉండిపోయాడు. వాచ్మెన్ను రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చూడండి: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం అబ్దుల్లాను ప్రశ్నించిన ఈడీ
Last Updated : Aug 1, 2019, 7:52 AM IST