రుణమాఫీ విధివిధానాలు రూపొందిస్తున్నామని.. త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సచివాలయంలో వ్యవసాయ అధికారులకు హ్యాండ్బుక్ విడుదల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కొంత మంది సచివాలయానికి వచ్చి రుణమాఫీ ఎక్కడ అని ప్రశ్నించారని ఆక్షేపించిన నిరంజన్ రెడ్డి... వారు చెప్తే చేయాలా అని ప్రశ్నించారు. సదరు వ్యక్తుల చెప్తేనే రైతుబంధు, రైతుబీమా అమలు చేశామా అని ఎద్దేవా చేశారు. రుణమాఫీ విధివిధానాలు రూపొందిస్తున్నామని... త్వరలోనే అమలు చేస్తామని మంత్రి చెప్పారు. వ్యవసాయ అధికారులకు కేసీఆర్ హయాంలో గొప్ప గౌరవం లభించిందని చెప్పుకొచ్చారు. కల్తీ విత్తనాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ పథకాలు మొత్తం కాపీ కొట్టిన కేంద్రం... పైసా కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు.
వ్యవసాయ శాఖకు వన్నె తీసుకురండి..
మీరు అడిగినదానికంటే ఎక్కువ వరాలు ఇవ్వటం ముఖ్యమంత్రికి అలవాటు. కష్టపడి పనిచేసి వ్యవసాయ శాఖకు వన్నె తీసుకురావాలని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ అధికారులకు సూచించారు.
వ్యవసాయ శాఖ