తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌లో ఏఐఎఫ్​టీయూ రాష్ట్ర మహాసభలు ప్రారంభం

హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి లోని సుందరయ్య కళా నిలయంలో ఏఐఎఫ్​టీయూ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి కార్మికులు, కర్షకులు హాజరయ్యారు.

By

Published : Aug 11, 2019, 7:05 PM IST

హైదరాబాద్‌లో ఏఐఎఫ్టియూ రాష్ట్ర మహాసభలు ప్రారంభం

నేడు సమాజంలో రెండు వర్గాలు నిరాశా నిస్పృహల మధ్య జీవనం కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కా రామయ్య విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో ఏఐఎఫ్​టీయూ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. సమావేశానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రంలో విద్యార్థులు, యువత నైరశ్యంలో కొనసాగుతున్నారని, నినాదాలు కనిపిస్తున్న ఆచరణ మాత్రం అమలు కావడం లేదని రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర పోరాటంలో పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కుల పరిరక్షించుకోవల్సిన అవసరముందని ఆచార్య హరగోపాల్ అన్నారు. సమాజంలో నిజమైన పోరాటాలలో ఐక్యత అవసరమని జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. ప్రజల్లో సోషలిస్టు చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరముందని, ఆర్థిక పోరాటాన్ని రాజకీయ పోరాటంగా మార్చితేనే పేదలకు సమన్యాయం జరుగుతుందన్నారు.

హైదరాబాద్‌లో ఏఐఎఫ్టియూ రాష్ట్ర మహాసభలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details