ఆదిలాబాద్లో పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ దివ్య దేవరాజన్ తెలిపారు. మొత్తం 280 కేంద్రాలకు ఈవీఎంలు తరలించామన్నారు. ఎన్నికల సిబ్బందికి వెల్ఫేర్ కిట్లను అందించినట్లు పేర్కొన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వారికి అవసరమైన సామగ్రిని ఈ కిట్లలో ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని దివ్య దేవరాజన్ కోరారు.
'నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోండి'
రాష్ట్రంలో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్లో పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే సిబ్బంది ఈవీఎంలను కేంద్రాలకు తరలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ దివ్య దేవరాజన్ తెలిపారు.
ఎన్నికల ఏర్పాట్లు