తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోండి'

రాష్ట్రంలో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్​లో పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే సిబ్బంది ఈవీఎంలను కేంద్రాలకు తరలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్​ దివ్య దేవరాజన్​ తెలిపారు.

By

Published : Apr 10, 2019, 10:34 PM IST

ఎన్నికల ఏర్పాట్లు

ఆదిలాబాద్​లో పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్​ దివ్య దేవరాజన్​ తెలిపారు. మొత్తం 280 కేంద్రాలకు ఈవీఎంలు తరలించామన్నారు. ఎన్నికల సిబ్బందికి వెల్ఫేర్​ కిట్లను అందించినట్లు పేర్కొన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వారికి అవసరమైన సామగ్రిని ఈ కిట్లలో ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్​ స్పష్టం చేశారు. దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని దివ్య దేవరాజన్​ కోరారు.

280 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి

ABOUT THE AUTHOR

...view details