తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​కు బ్యాగ్ సర్దుకోవడంలో సాయం చేస్తోంది ఎవరు!

యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్​లో పాల్గొనడానికి ముంబయి ఇండియన్స్​ జట్టు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. వారి పయనానికి సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ ​మీడియాలో షేర్​ చేస్తున్నారు. అందులో కెప్టెన్​ రోహిత్​ శర్మ పోస్ట్​ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ​

By

Published : Aug 21, 2020, 1:55 PM IST

IPL 2020: Samaira helps dad Rohit Sharma pack for UAE, Krunal Pandya gets used to 'new travel kit'
రోహిత్​ శర్మ కుమార్తె సమైరా ఏం చేస్తుందో చూడండి!

ఐపీఎల్​లో పాల్గొనడానికి శుక్రవారం యూఏఈ పయనమవనుంది ముంబయి ఇండియన్స్​ జట్టు. ఆటగాళ్లు తమ ప్రయాణానికి సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ ​మీడియాలో షేర్​ చేశారు. దుబాయ్​ వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ, ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్యా సోషల్​మీడియాలో పోస్టులు చేశారు.

అందులో కెప్టెన్​ రోహిత్​శర్మ చేసిన పోస్ట్​ అభిమానులను అమితంగా ఆకర్షిస్తోంది. దుబాయ్​ వెళ్లేందుకు బ్యాగ్​ సర్దుకోవడానికి తన కుమార్తె సమైరా సహాయం తీసుకున్నట్లు రోహిత్​ పోస్ట్​ చేశాడు. తన క్రికెట్​ కిట్​ను సమైరా ఆసక్తిగా చూస్తుందని తెలిపాడు. "యూఏఈ కోసం సిద్ధమవ్వడానికి ప్యాకర్​ ఇన్​ చీఫ్​ వచ్చింది. థ్యాంక్స్​ సామి" అనే క్యాప్షన్​తో పోస్ట్​ చేశాడు రోహిత్​.

కరోనా నుంచి తమను తాము రక్షించుకోవడానికి జట్టులోని ఆటగాళ్లతో సహా ఫ్రాంఛైజీ అధికారులూ పూర్తిగా బాడీ సూట్లు, షూ కవర్లు, గ్లౌజ్​లు, మాస్క్​లు, కళ్లద్దాలు ధరించారు. ఆ వేషధారణలో పాండ్యా సోదరులు ఓ ఫొటోను షేర్​ చేశారు. "మా కొత్త ట్రావెల్​ కిట్​తో యూఏఈ వెళ్లడానికి సిద్ధమయ్యాం" అని పోస్ట్​ పెట్టాడు కృనాల్​ పాండ్యా.

యూఏఈ వేదికగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు జరగనుంది. మొత్తం 53 రోజుల పాటు లీగ్‌ క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించనుంది. కోల్​కతా నైట్​రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు ఇప్పటికే యూఏఈ చేరుకున్నాయి. ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​కింగ్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు శుక్రవారం సాయంత్రానికి చేరుకుంటాయి. మిగిలిన సన్​రైజర్స్​ హైదరాబాద్​, దిల్లీ క్యాపిటల్స్​ జట్లు శనివారం పయనమవ్వనున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details