'సాహో' సినిమా కోసం రెండేళ్ల నుంచి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఎట్టకేలకు ఆగస్టు 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఈ నెలంతా ప్రమోషన్లలో పాల్గొననున్నాడు ప్రభాస్. దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నాడు రెబల్ స్టార్.
ఈ నెల 12న ఓ థియేటర్లో టీజర్ను విడుదల చేయనున్నారు. 18న ముందస్తు విడుదల వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రామోజీ ఫిల్మ్సిటీ వేదిక కానుంది.
ఇప్పటికే సాహోకు పోటీ రాకుండా తమ సినిమాలు వాయిదా వేసుకున్నారు నిర్మాతలు. ఇందుకు ప్రభాస్ ధన్యవాదాలు కూడా తెలిపాడు.