మలయాళ హీరో పృథ్వీరాజ్కు తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ సినిమాకు డైరెక్షన్ చేయమని ప్రతిపాదన వచ్చిందట. కానీ అతడు ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రజనీతో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోనందకు పృథ్వీ క్షమాపణ కూడా కోరాడట.
ఈ ఏడాది మొదట్లో మోహన్లాల్ హీరోగా వచ్చిన 'లూసిఫర్' చిత్రానికి దర్శకత్వం వహించాడు పృథ్వీరాజ్. ఆ సినిమా విడుదలైన తరువాతే రజనీకాంత్ నుంచి అవకాశం వచ్చింది. పృథ్వీ ఒక నటునిగానే కాక, గాయకుడు, నిర్మాతగాను వ్యవహరించాడు. ప్రస్తుతం పృథ్వీ చేతిలో 'ఆదు జీవితం', 'కడువ' చిత్రాలు ఉన్నాయి. ఇటీవలేవిడుదలైన 'డ్రైవింగ్ లైసెన్స్'ప్రేక్షకులను అలరించింది.