తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సక్సెస్​ మీట్​లో ఏడ్చిన హీరోయిన్​- కారణం ఇదే!

సినిమా విజయవంతమైందంటే ఉబ్బితబ్బిబ్బైపోయే కథానాయికలున్న సినీరంగంలో... ఓ కథానాయిక మాత్రం సినిమా సక్సెస్ అయ్యిందని కన్నీరు పెట్టుకుంది. మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్నదాని కంటే తన సినిమా హిట్ అవ్వడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని కిల్లర్ కథానాయిక అషిమా ఆనందబాష్పాలతో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.

By

Published : Jun 14, 2019, 7:46 PM IST

కన్నీటి పర్యంతమైన హీరోయిన్

కన్నీటి పర్యంతమైన హీరోయిన్ అషిమా

యాక్షన్​ కింగ్​ అర్జున్, విజయ్ ఆంటోని ప్రధాన పాత్రల్లో ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో తెరకెక్కిన కిల్లర్​ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన అన్ని చోట్ల ప్రేక్షకాదరణ పొందుతూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్​లో చిత్ర బృందం విజయోత్సవాలు జరుపుకుంది. అర్జున్, విజయ్ ఆంటోనితోపాటు కథానాయిక అషిమా, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు హాజరై కేక్ కట్ చేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

తన మూడు సినిమాలు సక్సెస్ కావడం పట్ల కథానాయిక అషిమా భావోద్వేగంతో కన్నీటి పర్యంతమైంది. మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్నదాని కంటే తన సినిమా హిట్ అవ్వడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించింది.

తెలుగు రాష్ట్రాల్లో విడుదలై అన్నిచోట్లా కిల్లర్ చిత్రం మంచి టాక్​ సంపాందించింది. ఫలితంగా ఈ చిత్రానికి రెండో వారంలో మరో 60 థియేటర్లు పెరగడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details