తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అస‌లేం జ‌రిగింది' షూటింగ్ పూర్తి

టాలీవుడ్​లో హీరో శ్రీరాం, సంచితా పదుకొనే ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'అసలేం జరిగింది'. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

By

Published : Apr 8, 2019, 3:50 PM IST

అసలేం జరిగింది చిత్రం

హీరో శ్రీరాం, సంచితా ప‌దుకునే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'అసలేం జరిగింది' చిత్రం షూటింగ్ పూర్తయింది. ఎక్సోడ‌స్ మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రం హైద‌రాబాద్‌, మెద‌క్‌, ఆదిలాబాద్‌, నిర్మ‌ల్ వంటి ప్రాంతాల్లో దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. సినిమాలోని యాక్ష‌న్ సీక్వెన్స్ ప్ర‌ధానాక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని సహ నిర్మాత కింగ్ జాన్స‌న్ కొయ్య‌ాడ తెలిపారు.

ల‌వ్‌, స‌స్పెన్స్‌, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్‌గా రూపొందుతోందీ సినిమా. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసి మే నెల‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details