అనుపమ పరమేశ్వరన్.. ఇటీవలే బెల్లంకొండ సురేశ్తో కలిసి 'రాక్షసుడు' చిత్రంలో నటించి మరో హిట్ను ఖాతాలో వేసుకుంది. ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో తీరిక లేకుండా ఉండే ఈ కేరళ కుట్టి ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేసింది.
బుంగమూతి పెట్టి.. బాధగా "మిస్ యూ ఆల్" అంటూ కామెంట్ పెట్టింది అనుపమ.
అయితే అనుపమకు ఏమైంది అంటూ కొంత మంది సామాజిక మాధ్యమాల్లో విశేషంగా స్పందిస్తున్నారు. ఆమె ఎవరినో మిస్ అవుతుందంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.
ప్రస్తుతం కన్నడలో పునీత్ రాజ్కుమార్ సరసన 'నట సార్వభౌమ' చిత్రంలో నటిస్తోంది. శాండిల్వుడ్లో ఆమెకిదే తొలిచిత్రం. 'నిన్నుకోరి' తమిళ రీమేక్, మలయాళంలో దుల్కర్ సల్మాన్తో మరో చిత్రంలోనూ లీడ్ రోల్ పోషిస్తోందీ కేరళ ముద్దుగుమ్మ.
ఇది చదవండి: సినిమాల్లోనే కాదు... వ్యవసాయంలోనూ సూపర్ హిట్టే