ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని ఆటో స్టాండ్ దగ్గర ఉన్న గుడిలో... సీతమ్మవారి విగ్రహం కిందపడి పగిలిపోయి ఉంది. ఇది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా? లేక యాదృచ్ఛికంగా జరిగిందా అన్నది తెలియడం లేదని అర్చకులు తెలిపారు. ఆరుబయట ఉన్న ఆలయంలో పిల్లులు తిరుగుతుంటాయని... అవి తోయడం వల్ల విగ్రహం కిందపడిందా అనే అనుమానమూ వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
విజయవాడలో సీతమ్మవారి విగ్రహం ధ్వంసం!
ఆంధ్రప్రదేశ్లో విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్దనున్న సీతారామ మందిరంలో... సీతమ్మవారి విగ్రహన్ని దుండగులు ధ్వంసం చేశారు.
విజయవాడలో సీతమ్మవారి విగ్రహం ధ్వంసం!