తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా

తెలుగు రాష్ట్రాల డిస్కం వెబ్​సైట్లు హ్యాక్​కు గురయ్యాయి. అంతర్జాతీయ హ్యాకర్లు డేటా డిలీట్ చేసి... 35 కోట్లు డిమాండ్ చేశారు. ఐటీ యాక్ట్ కింద సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు

By

Published : May 2, 2019, 10:50 AM IST

Updated : May 2, 2019, 3:42 PM IST

hack

తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా విసిరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్కం వెబ్​సైట్లను హ్యాక్ చేశారు. ర్యాన్సమ్ వెర్ వైరస్​తో రెచ్చిపోయారు. టీఎస్ఏస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీఎస్ఎల్ వెబ్ సైట్లు హ్యాక్​ అయ్యాయి.

డేటా హ్యాక్ చేయడంతో పాటు డిలీట్ చేసి రూ.35 కోట్లు డిమాండ్ చేశారు అంతర్జాతీయ హ్యాకర్లు. డేటా బ్యాకప్ ఉండటంతో ముప్పు తప్పిందని అధికారులు తెలిపారు. డిస్కంల హ్యాకింగ్​పై సీసీఎస్ పోలీసులకు టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్ట్ కింద హైదరాబాద్​ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా
Last Updated : May 2, 2019, 3:42 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details