తెలంగాణ

telangana

ETV Bharat / international

ఒకే కాన్పులో అరడజను​ మంది పిల్లలు

పోలెండ్​లో అద్భుతం జరిగింది. ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. వారిలో నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు.  ప్రస్తుతం తల్లీపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

By

Published : May 21, 2019, 9:06 AM IST

ఒకే కాన్పులో అరడజను​ మంది పిల్లలు

ఆరుగురు శిశువులకు ఒకేకాన్పులో జన్మనిచ్చింది పోలెండ్​కు చెందిన ఓ మహిళ. ఆ దేశంలో ఇలా జరగడం ఇదే తొలిసారి.

క్రకోవ్​ నగరంలోని వైద్య విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది 29 ఏళ్ల ఓ మహిళ. జన్మించిన వారిలో నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. ప్రస్తుతం తల్లి, ఆరుగురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

పిల్లలు సుమారు 890 గ్రాముల నుంచి 1.3 కిలోగ్రాముల వరకు బరువు ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆ మహిళకు ఇప్పటికే రెండేళ్ల బాలుడు ఉన్నాడని చెప్పారు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయని వైద్యులు పేర్కొంటున్నారు.

ఆ దేశ అధ్యక్షుడు అండ్రెజెజ్​ డుడా ట్విట్టర్​ వేదికగా పిల్లల తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. వైద్యులకు కృతజ్ఞతలు చెప్పారు.

ఇదీ చూడండి:అతిథిగా వచ్చాడు- రూ.280 కోట్ల రుణాలు తీర్చాడు

ABOUT THE AUTHOR

...view details