పాకిస్థాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ) మంగళవారం ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్తో పాటు ప్రముఖ రాజకీయ నేతలకు సంబంధించిన ఆస్తుల వివరాలను వెల్లడించింది. ఇమ్రాన్కు రూ. 10.8 కోట్ల ఆస్తులున్నాయని ప్రకటించింది.
ఆయనకు ఉన్న బనీ గలా ఎస్టేట్పై ఇమ్రాన్ ఈసీకి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ ఎస్టేట్ తనకు కానుకగా వచ్చిందని ఇమ్రాన్ ఖాన్ తెలిపినట్లు ఈసీ ప్రకటించింది. ఆయన భార్య బుర్షా బీబీకి ఇదే ఎస్టేట్లో సొంత ఇల్లు, పాక్ప ట్టాన్, ఒకారాలో భూమి ఉంది.
ఇమ్రాన్కు మూడు ఫారెన్ కరెన్సీ ఖాతాలు ఉన్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇంకా 150 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.50,000 విలువ చేసే నాలుగు మేకలు ఉన్నాయని వెల్లడించింది.