జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించే వరకు భారత్తో చర్చలకు అవకాశం లేదని పాతపాటే పాడారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. ఇస్లామాబాద్లో డిజిటల్ మీడియా ప్రతినిధులతో సమావేశం సందర్భంగా భారత్తో చర్చలపై అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు ఇమ్రాన్.
" జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించే వరకు భారత్తో చర్చలకు అవకాశమే లేదు. పాకిస్థాన్ను అస్థిరపిచేందుకు ప్రయత్నిస్తున్న భారత్ మినహా మాకు ఏ దేశంతోనూ విభేదాలు లేవు."
- ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధాని
2016లో పఠాన్కోట్లోని వైమానిక స్థావరంపై పాకిస్థాన్ ఆధారిత ఉగ్రమూకలు దాడి చేసిన క్రమంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఉరిలోని భారత సైనిక క్యాంపుపై దాడితో సంబంధాలు మరింత క్షీణించాయి. పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎప్ జవాన్లను పొట్టనపెట్టుకున్న క్రమంలో 2019, ఫిబ్రవరి 29న పాకిస్థాన్లోని జైషే మహమ్మద్ ఉగ్రస్థావరంపై వైమానిక దాడులు చేసింది భారత్. దాంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అదే ఏడాది ఆగస్టులో జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి, ఆర్టికల్ 370 రద్దు చేసింది కేంద్రం. దీనిపై పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెట్టింది.
ఇదీ చూడండి:మూణ్నెళ్లా.. ఆర్నెళ్లా.. రెండేళ్లా? ఏ టీకా పవరెంత?