ఇండోనేషియాలో నిరసనలు భగ్గుమన్నాయి. పపువా రాష్ట్రంలోని వామెనా నగరంలో విజృంభించిన వందలాది ఆందోళనకారులు.. స్థానిక ప్రభుత్వ భవనాలు, దుకాణాలు, నివాసాలకు నిప్పింటించారు. ఈ ఘటనలో 20మంది ప్రాణాలు కోల్పోయారు. 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ విద్యార్థినిపై ఉపాధ్యాయుడు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో నిరసనలు మొదలయ్యాయి.
స్వల్ప కాలంలోనే ఈ ఆందోళనలు పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. పపువా రాజధాని జయపురాలో జరిగిన నిరసనల్లో ఓ సైనికుడితో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.