జమ్ము కశ్మీర్ విషయంలో దుందుడుకు వ్యాఖ్యలు తగ్గించుకోవాలని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. అమెరికా అధ్యక్షుడితో భారత ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన ఫోన్ సంభాషణ అనంతరం.. ట్రంప్ పాక్ ప్రధానితో ఈ విధంగా మాట్లాడారు.
భారత్-పాక్లు శాంతియుత చర్చల ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని ఇమ్రాన్ఖాన్కు ట్రంప్ హితవు పలికినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగకుండా చూడాలని, ఇరుదేశాలు సంయమనం పాటించాలని ట్రంప్ కోరినట్టు తెలిపింది.
"నేను నా ఇద్దరు మిత్రులు... మోదీ, ఇమ్రాన్ఖాన్తో మాట్లాడాను. వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యాల గురించి మేం చర్చించాం. ముఖ్యంగా భారత్-పాక్లు... కశ్మీర్లో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా కృషి చేయడం గురించి చర్చించాను." - డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్.
ఈ వారంలో పాక్ ప్రధానితో ట్రంప్ సంభాషించడం ఇది రెండోసారి.