'హాట్డాగ్' తిండిబోతు విజేతలు జోస్, మికీ అమెరికా న్యూయార్క్లోని కోనీ ద్వీపంలో నిర్వహించిన ప్రసిద్ధ నాథన్ హాట్డాగ్ తిండిపోటీలు అట్టహాసంగా ముగిశాయి. ఈ పోటీల్లో జోయి జాస్ చెస్ట్నెట్ 71 వీఎనర్లు, రొట్టెలు తినేసి.. రికార్డు స్థాయిలో 12వ సారీ టైటిల్ విజేతగా నిలిచాడు. మహిళా విభాగంలో మికీ సూడో మరోసారి విజేతగా నిలిచింది. 31 వీఎనర్లు, రొట్టెలు లాగించి, టైటిల్ను ఎగరేసుకుపోయింది.
అయితే ఈ తిండిబోతు విజేతలు తమ గత రికార్డులను మాత్రం అధిగమించలేకపోయారు.
పురుషుల విభాగంలో 17 మంది ప్రత్యర్థులతో పోరాడి విజయం సాధించిన జోస్ జాయిస్ 2018లో 74 వీఎనర్లు, రొట్టెలు ఆబగా తినేసి, రికార్డు నెలకొల్పాడు. అయితే ఈసారి ఆ రికార్డుకు 3 బన్నుల దూరంలోనే నిలిచిపోయాడు.
"పోటీ చివరి 5 నిమిషాల్లో నెమ్మదిగా తినడం వల్లనే రికార్డు కోల్పోయాను. అయితే మరలా టైటిల్ నిలబెట్టుకోవడం ఆనందంగా ఉంది."
-జోస్, విజేత
ఈ పోటీల్లో జోస్ చిరకాల ప్రత్యర్థి, 2007 ట్రోఫీ విజేత తకేరు కోబయాషి ఈ పోటీల్లో పాల్గొనలేదు.
ఈ హాట్డాగ్ తిండి పోటీలు 1972లో ప్రారంభమయ్యాయి. అయితే 1916లో ప్రారంభమైన నాథన్ కంపెనీ ఈ పోటీలను అప్పటి నుంచే ప్రోత్సహిస్తోంది.
ఇదీ చూడండి:మాలీలో తెగల మధ్య పోరాటం.. 38 మంది మృతి