తెలంగాణ

telangana

ETV Bharat / city

చేతబడి చేసాడనే అనుమానంతో వ్యక్తి సజీవ దహనం

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని దారుణంగా హత్యచేసి తగులబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.

By

Published : Sep 19, 2019, 9:52 AM IST

చేతబడి నెపంతో ఓ వ్యక్తి సజీవ దహనం

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని దారుణంగా హత్యచేసి తగులబెట్టారు. అద్రాసుపల్లి గ్రామానికి చెందిన గ్యార లక్ష్మికి ఆంజనేయులు చేతబడి చేశాడని గ్రామస్థులు అనుమానించి సజీవ దహనం చేశారు. సమాచారమందుకున్న శామీర్‌పేట పోలీసులు సీఐ నవీన్‌రెడ్డి, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సగం కాలిన మృతదేహానికి పంచనామా నిర్వహించారు. నిందితులు పరారీలో ఉన్నారు. దీనికి సంబందించి మరిన్నీ వివరాలు మా ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీకాంత్​ అందిస్తారు.

చేతబడి చేసాడనే అనుమానంతో వ్యక్తి సజీవ దహనం

ABOUT THE AUTHOR

...view details