రైతులకు తక్షణమే రుణమాఫీ అమలుతో పాటు కొత్త రుణాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇంకా అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని బ్యాంకర్లు చెబుతున్నారని పేర్కొన్నారు. రైతుల నుంచి వడ్డీ సహా రుణాలను బ్యాంకులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. వడ్డీ లేని రుణాలపై స్పష్టత ఇవ్వలేదన్నారు. కొత్త రుణాలు లేక పెట్టుబడి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు సాయం కూడా 50 శాతం రైతులకే అందిందని లేఖలో వెల్లడించారు.
రుణమాఫీ చేసి, కొత్త రుణాలివ్వండి: జీవన్ రెడ్డి
రైతుల రుణమాఫీ, కొత్త రుణాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. రుణాలు లేక పెట్టుబడి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
jeevan reddy