డిగ్రీ, పీజీ విద్యార్థులకు పరీక్షలు లేకుండా తాత్కాలికంగా ప్రమోట్!
18:15 May 29
డిగ్రీ, పీజీ విద్యార్థులకు పరీక్షలు లేకుండా తాత్కాలికంగా ప్రమోట్!
డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై యూనివర్సిటీలకు ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు జారీ చేసింది. తుది సెమిస్టర్ పరీక్షలు మాత్రమే నిర్వహించాలని సూచించింది. చివరి ఏడాది విద్యార్థులకు జూన్ 20 నుంచి పరీక్షలు నిర్వహించవచ్చని పేర్కొంది. మిగతా సెమిస్టర్లకు నవంబర్ లేదా డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. పరీక్షా సమయం రెండు గంటలు మాత్రమే ఉండాలని సూచించింది.
ప్రశ్నాపత్రంలోనూ ఎక్కువ ఐచ్ఛికాలు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి వెల్లడించింది. అన్ని సెమిస్టర్ విద్యార్థులను పరీక్షలు లేకుండా తాత్కాలికంగా ప్రమోట్ చేయాలని తెలిపింది. ప్రాజెక్టు, సెమినార్, వైవాలు, ఆన్లైన్లో నిర్వహించాలని ఆదేశించింది. అన్ని సూచనలపై తుది నిర్ణయం వర్సిటీలకే ఇచ్చింది.