పంట రుణాలపై వడ్డీని రైతుల నుంచి బ్యాంకులు నిక్కచ్చిగా వసూలు చేయకుండా వారికి చేయూతనిచ్చేందుకు వడ్డీలేని పంట రుణాల పథకాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ అమలు చేస్తోంది. కానీ, ఈ పథకం కింద రెండేళ్లుగా నిధులు విడుదల కాకపోవడం వల్ల దీనిపై బ్యాంకులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటివరకూ దాదాపు 25 లక్షల మంది రైతుల నుంచి రూ.780 కోట్లు వసూలు చేసినట్లు వ్యవసాయ శాఖకు బ్యాంకులు తాజాగా నివేదిక ఇచ్చాయి. ప్రభుత్వం ఈ నిధులు ఇస్తే తిరిగి రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలిపాయి. ఈ పథకం కింద బకాయిల చెల్లింపునకు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా రూ.256 కోట్ల విడుదలకు గత మే 31న పరిపాలన అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఈ నిధుల కోసం ఖజానాకు బిల్లులు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. గతేడాది (2018) జూన్లోనూ ఇలాగే నిధుల విడుదలకు పరిపాలన ఉత్తర్వులిచ్చినా ఖజానా నుంచి నిధులు వెళ్లలేదు. ఒక రైతు బ్యాంకులో పంట రుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోపు తిరిగి చెల్లిస్తే వడ్డీ కట్టాల్సిన పనిలేదని వీఎల్ఆర్ నిబంధన ఉంది. పంట రుణం ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే 7 శాతం వడ్డీ పడుతుంది. ఇందులో 3 శాతం కేంద్రం ఇస్తుంది. మిగతా 4 శాతాన్ని వీఎల్ఆర్ కింద రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4 శాతం సొమ్ము రాకపోవడం వల్ల వడ్డీ బకాయిలు రూ.780 కోట్లకు చేరాయి.
ఈ ఖరీఫ్లో ఇచ్చింది 36 శాతమే