తెలంగాణ

telangana

ETV Bharat / business

టీసీఎస్​లో షేర్లు ఉన్నాయా? మీకో శుభవార్త!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్​ ప్రకటించింది టీసీఎస్​. రూ.1 ముఖ విలువ కలిగిన సంస్థ షేరుపై.. రూ.12 డివిడెండ్​ చెల్లించనున్నట్లు వెల్లడించింది.

By

Published : Mar 10, 2020, 6:43 PM IST

TCS DIVIDEND
టీసీఎస్​ డివిడెండ్​

దేశీయ టెక్​ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (టీసీఎస్​) మధ్యంతర డివిడెండ్​ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) సంబంధించి ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్​ ఇవ్వాలని నిర్ణయించింది.

ముఖ విలువ రూ.1 కలిగిన షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్​ ఇవ్వాలన్న ప్రతిపాదనకు సంస్థ డైరెక్టర్ల బోర్డు నేడు ఆమోదం తెలిపింది. మార్చి 24న ఈక్విటీ వాటాదారులకు మధ్యంతర డివిడెండ్​ చెల్లించనున్నట్లు టీసీఎస్​ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:ఎస్​ బ్యాంకులో ఐఎంపీఎస్​, నెఫ్ట్ సేవల పునరుద్ధరణ

ABOUT THE AUTHOR

...view details