దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) సంబంధించి ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయించింది.
టీసీఎస్లో షేర్లు ఉన్నాయా? మీకో శుభవార్త!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది టీసీఎస్. రూ.1 ముఖ విలువ కలిగిన సంస్థ షేరుపై.. రూ.12 డివిడెండ్ చెల్లించనున్నట్లు వెల్లడించింది.
టీసీఎస్ డివిడెండ్
ముఖ విలువ రూ.1 కలిగిన షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలన్న ప్రతిపాదనకు సంస్థ డైరెక్టర్ల బోర్డు నేడు ఆమోదం తెలిపింది. మార్చి 24న ఈక్విటీ వాటాదారులకు మధ్యంతర డివిడెండ్ చెల్లించనున్నట్లు టీసీఎస్ స్పష్టం చేసింది.