డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి 24 గంటలు నెఫ్ట్ ద్వారా లావాదేవీలకు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ విధానం అమలైతే రిటైల్ లావాదేవీల్లో ఇదో విప్లవంగా మారుతుందని రిజర్వు బ్యాంకు భావిస్తోంది.
జాతీయ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్).. ప్రస్తుతం పని దినాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నెలలో రెండు, నాలుగో శనివారాలు నెఫ్ట్కు సెలవు దినాలు.