చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షియోమీ తన రెడ్మీ కే20ని ఇప్పుడు కేవలం రూ.17,999లకే అందిస్తోంది. రియల్మీ ఎక్స్2తో పోల్చితే దీనిలో ప్రకాశవంతమైన అమోలెడ్ స్క్రీన్, ఆప్టిమైజ్డ్ ఎంఐయూఐ 10 సాఫ్ట్వేర్, మంచి కెమెరాలు, అద్భుతమైన డిజైన్ ఉన్నాయి.
రూ.22,999 ప్రారంభ ధరతో భారత్లో విడుదలైన రెడ్మీ కే20... ఉత్తమమైన మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లలో ఒకటి.
మొదటిసారిగా భారీ తగ్గింపు
షియోమీ తొలిసారి తన రెడ్మీ కే20 (6జీబీ+64జీబీ) మోడల్ ధరను రూ.17,999కు తగ్గించింది. కాగా 6జీబీ+128జీబీ మోడల్ రిటైల్ ధరను రూ.20,999గా ఉంచింది.
రెడ్మీ కే20 ప్రో ఫోన్లు ప్రస్తుతం డిస్కౌంట్ ధరల్లో లభిస్తున్నాయి. 6జీబీ+128జీబీ మోడల్ రూ.22,999కు, 8జీబీ+256జీబీ మోడల్ రూ.25,999 వద్ద లభిస్తున్నాయి. ఈ ఆఫర్ జనవరి 17 వరకు మాత్రమే అందుబాటులో ఉంది.
రెడ్మీ కే20 కొనొచ్చా?
రెడ్మీ కే30 వచ్చే నెలలో భారత మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే షియోమీ రెడ్మీ కే20ని డిస్కౌంట్ ధరలకు అందిస్తోంది. రూ.17,999 ధర వద్ద ఈ స్మార్ట్ఫోన్ మంచి డీల్ అవుతుంది అనడంలో సందేహం లేదు.
ఎస్బీఐ క్రెడిట్కార్డ్ వినియోగదారులు ఎమ్ఐ.కామ్లో జనవరి 17లోపు ఈ స్మార్ట్ఫోన్ కొంటే రూ.2000 వరకు అదనంగా మినహాయింపు పొందవచ్చు.