నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీ రేటును తగ్గిస్తూ ఫిబ్రవరి 24న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని జీఎస్టీ మండలి మంగళవారం అమోదించింది. దీంతో ఇప్పటి వరకు నిర్మాణంలో ఉన్న ఇళ్లపై 5 శాతంగా ఉన్న జీఎస్టీ రేటు 1 శాతం అయింది.
సొంతింటి కలగనేవారికి శుభవార్త
నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీ రేట్లను తగ్గించాలన్న నిర్ణయానికి మంగళవారం జీఎస్టీ మండలి ఆమోద ముద్ర వేసింది.
జీఎస్టీ మండలి
తగ్గిన జీఎస్టీ రేట్లపై రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపేందుకు నిర్మాణదారులకు తగిన సమయం ఇస్తామని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి ఎ.బి పాండే ప్రకటించారు. అన్ని కొత్త ప్రాజెక్టులకు ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ తప్పనిసరి అని పాండే తెలిపారు.
Last Updated : Mar 19, 2019, 9:01 PM IST