తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీ

వరంగల్​ అర్బన్​ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు విజయోత్సాహంతో మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

By

Published : Jun 4, 2019, 6:04 PM IST

విజయోత్సవ ర్యాలీ

వరంగల్​ అర్బన్​ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గెలిచిన అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు విజయోత్సాహంతో మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని, గెలుపొందిన వారిని భుజాలపై మోస్తూ సంతోషాల్ని ఆస్వాదించారు. మడికొండలోని గురుకుల పాఠశాల, రాంపూర్​లోని వీఎమ్మార్​ పాలిటెక్నిక్​ కళాశాలలో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని భీమదేవరపల్లి, హసన్పర్తి, కమలాపుర్, ఎల్కతుర్తి, ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు మండలాలకు చెందిన ఓట్లను ఇక్కడ లెక్కించారు.

విజయోత్సవ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details