మహారాష్ట్ర పుణె జిల్లాకు చెందిన వేదిక అనే చిన్నారి అరుదైన వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్న ఆ పసికందుకు.. రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ను అందించిన కొన్నినెలలకే ప్రాణాలు కోల్పోయింది.
రూ.16కోట్ల ఇంజెక్షన్ అందించినా.. దక్కని ప్రాణం
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి దాతల సాయంతో రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అందించినా.. ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. తమ బిడ్డను బతికించుకోవాలని ఎంతో శ్రమ పడిన ఆ తల్లిదండ్రులకు విషాదమే మిగిలింది.
రూ.16 కోట్లు ఇంజెక్షన్
చిన్నారి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు ఎంతో శ్రమించారు. దాతల సాయంతో రూ.16 కోట్లు సమకూర్చారు. అమెరికా నుంచి ఆ వ్యాధిని నయం చేసే జోల్గెన్జామా ఓనాసెమ్నోజీనీ ఔషధాన్ని తెప్పించారు. చికిత్సలో భాగంగా జూన్ నెలలో ఆ ఇంజెక్షన్ అందించారు. అయితే ఇటీవల ఆరోగ్యం క్షీణించి.. ఆదివారం ఆ చిన్నారి కన్నుమూసింది.
ఇదీ చూడండి:చిన్నారికి 'రూ.16కోట్ల' ఉచిత చికిత్స
Last Updated : Aug 2, 2021, 4:41 PM IST