తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పార్లమెంటుకే నివేదిక ఇచ్చేలా సీబీఐకి స్వయం ప్రతిపత్తి!'

పార్లమెంటుకు మాత్రమే నివేదిక ఇచ్చేలా సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని మద్రాసు హైకోర్టు అభిప్రాయ పడింది. ఓ కేసు విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

By

Published : Aug 18, 2021, 11:05 AM IST

Updated : Aug 18, 2021, 11:32 AM IST

Give CBI more autonomy, let it report only to Parliament: Madras HC
'పార్లమెంటుకు మాత్రమే నివేదిక ఇచ్చేలా సీబీఐకి స్వయంప్రతిపత్తి'

కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐకి కాగ్​, ఈసీ మాదిరిగా స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరముందని మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. కేవలం పార్లమెంటుకు మాత్రమే నివేదికలు అందించే వెసులుబాటు ఈ సంస్థకు కల్పించాలంది.

తమిళనాడులో జరిగిన రూ.300 కోట్ల పోంజీ కుంభకోణంపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్​ విచారణ సందర్భంగా మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది మద్రాసు హైకోర్టు. సీబీఐకి స్వయంప్రతిపత్తి కల్పించేలా చట్టాన్ని తీసుకువచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని జస్టిస్​ ఎన్​ కిరుబకరణ్​, జస్టిస్​ బీ పుగలెంధిలతో కూడిన మధురై బెంచ్​ పేర్కొంది. ఈసీ, కాగ్‌ మాదిరిగా సీబీఐ స్వతంత్రంగా పనిచేయాలని వ్యాఖ్యానించింది.

"ఏదైనా కేసును సీబీఐ విచారించాలని డిమాండ్​ వచ్చినప్పుడల్లా.. తమ వద్ద సరిపడా వనరులు, సిబ్బంది లేరని అధికారులు తరచూ కోర్టులకు చెప్పడం బాధాకరం. సీబీఐ డైరెక్టర్​ నేరుగా కేంద్రమంత్రి, ప్రధానికి రిపోర్టు ఇచ్చేలా కేబినెట్ కార్యదర్శి తరహాలో ప్రత్యేక అధికారాలు కలిగి ఉండాలి. సీబీఐకి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ఈ సంస్థకు కావాల్సిన కనీస సదుపాయాలు, భవనాలు, నివాసాలు, సాంకేతిక అవసరాలు ఆరు వారాల్లో తీర్చాలి" అని న్యాయస్థానం పేర్కొంది.

ఇదీ చూడండి:తొలి మహిళా సీజేఐగా ఆ న్యాయమూర్తికే అవకాశం?

Last Updated : Aug 18, 2021, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details