కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐకి కాగ్, ఈసీ మాదిరిగా స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరముందని మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. కేవలం పార్లమెంటుకు మాత్రమే నివేదికలు అందించే వెసులుబాటు ఈ సంస్థకు కల్పించాలంది.
తమిళనాడులో జరిగిన రూ.300 కోట్ల పోంజీ కుంభకోణంపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది మద్రాసు హైకోర్టు. సీబీఐకి స్వయంప్రతిపత్తి కల్పించేలా చట్టాన్ని తీసుకువచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని జస్టిస్ ఎన్ కిరుబకరణ్, జస్టిస్ బీ పుగలెంధిలతో కూడిన మధురై బెంచ్ పేర్కొంది. ఈసీ, కాగ్ మాదిరిగా సీబీఐ స్వతంత్రంగా పనిచేయాలని వ్యాఖ్యానించింది.