దిల్లీలోని జవహార్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ)లో విద్యార్థులు రెచ్చిపోయారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కార్యక్రమం కవరేజీ కోసం వచ్చిన ఈటీవీ-భారత్ రిపోర్టర్పై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు కొంత మంది విద్యార్థులు.
కార్యక్రమం జరుతుండగానే రిపోర్టర్ను తోస్తూ అతని వద్ద ఉన్న మోజో కిట్ను లాక్కునేందుకు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో అతడిని చుట్టుముట్టిన విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.