తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈటీవీ-భారత్​ రిపోర్టర్​​పై విద్యార్థుల దాడి!

దిల్లీ జేఎన్​యూలో కేంద్రమంత్రి సెమినార్​ కవరేజీ చేసేందుకు వచ్చిన ఈటీవీ-భారత్​ రిపోర్టర్​పై దాడి చేశారు కొంతమంది విద్యార్థులు. పాత్రికేయుడిని తోస్తూ.. ఆయన వద్ద ఉన్న మోజో కిట్​ను లాక్కునేందుకు ప్రయత్నించారు.

By

Published : Oct 4, 2019, 6:57 AM IST

ఈటీవీ-భారత్​ రిపోర్టర్​​పై విద్యార్థుల దాడి!

ఈటీవీ-భారత్​ రిపోర్టర్​​పై విద్యార్థుల దాడి!

దిల్లీలోని జవహార్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్​యూ)లో విద్యార్థులు రెచ్చిపోయారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​ కార్యక్రమం కవరేజీ కోసం వచ్చిన ఈటీవీ-భారత్​ రిపోర్టర్​​పై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు కొంత మంది విద్యార్థులు.

కార్యక్రమం జరుతుండగానే రిపోర్టర్​ను తోస్తూ అతని వద్ద ఉన్న మోజో కిట్​ను లాక్కునేందుకు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో అతడిని చుట్టుముట్టిన విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.

అధికరణ 370 రద్దుపై జేఎన్​యూలో గురువారం సెమినార్​ నిర్వహించారు కేంద్రమంత్రి. ప్రభుత్వ నిర్ణయంపై ప్రసంగించారు జితేంద్ర సింగ్​. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించిన కొంతమంది విద్యార్థులు.. కవరేజీ చేయొద్దని రిపోర్టర్​పై దాడి చేశారు.

ఇదీ చూడండి: స్వచ్ఛభారత్​ కోసం వింగ్​ కమాండర్​ వినూత్న ఫీట్

ABOUT THE AUTHOR

...view details