తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సర్వం సిద్ధం: ఐఏఎఫ్​

పాకిస్థాన్​ ఏ రూపంలో దాడికి యత్నించినా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఐఏఎఫ్​ ప్రకటించింది. పాక్​ కవ్వింపు చర్యలకు పాల్పడితే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.

By

Published : Mar 8, 2019, 5:26 PM IST

సర్వం సిద్ధం: ఐఏఎఫ్

జమ్ముకశ్మీర్​ పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్​-పాక్​ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్​ నుంచి ఎదురయ్యే ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళం (ఐఏఎఫ్​) తెలిపింది. పాక్​ వాయుసేన కవ్వింపు చర్యలకు పాల్పడితే దీటుగా జవాబిస్తామని స్పష్టం చేసింది. పశ్చిమ భారత్​లోని ఐఏఎఫ్​ శిబిరాలన్నింటికీ హై అలర్ట్​ హెచ్చరికలు జారీ చేశామని ప్రకటించింది.

పునఃప్రారంభం కాని విమానసేవలు...

ఒమన్​, ఇరాన్​, అఫ్గానిస్థాన్​, చైనా దేశాలకు విమాన సేవలనుపాక్పునరుద్ధరించింది. భారత్​-పాక్​ సరిహద్దులోని 11 విమానాశ్రయాల్లో సేవలు మాత్రం ఇప్పటికీ పునఃప్రారంభం కాలేదని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details