తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజస్థాన్​లో బాలికలపై అమానుషాలు

రాజస్థాన్​లో వేర్వేరు చోట్ల ముగ్గురు బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు కల్లోలం సృష్టిస్తున్నాయి. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By

Published : May 19, 2019, 5:21 AM IST

రాజస్థాన్​లో బాలికలపై అమానుషాలు

దేశంలో ఉన్మాదుల చర్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు మృగాళ్లు. తాజాగా రాజస్థాన్​లో బాలికలపై జరిగిన మూడు అత్యాచార ఘటనలు మహిళలు, చిన్నారుల భద్రతపై మరింత ఆందోళనలు పెంచుతున్నాయి.

వివాహానికి వెళ్తుండగా..

15 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన ఈ నెల 14న అల్వార్​లోని హస్​రౌరా గ్రామంలో జరిగింది. బంధువుల వివాహానికి వెళ్తుండగా బాలికపై అత్యాచారం జరిగింది. నిందితుల్లో ఇద్దరిపై బాధితురాలి కుటుంబ సభ్యులు దాడి చేశారు. మరొకరు తప్పించుకున్నారు. కుటుంబ సభ్యుల దాడిలో ఓ నిందితుడు మృతి చెందాడు. పోలీసులు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని జువైనల్​ హోంకు తరలించారు.

బాధితురాలి బంధువులు సమీప పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు​ నమోదు చేశారు. బాధితురాలి సోదరుడిపై మరణించిన మైనర్​ కుటుంబ సభ్యులూ ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

ఆరేళ్ల చిన్నారిపై..

మంచి నీటి కోసం బయటకు వెళ్లిన ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన చురులోని భానిపుర ప్రాంతాన్ని కుదిపేసింది. 14 ఏళ్ల బాలుడు శుక్రవారం ఆ చిన్నారిపై ఘాతుకానికి పాల్పడినట్టు భానిపుర పోలీసులు తెలిపారు.

ధోల్​పూర్​లో...

8 ఏళ్ల బాలికపై శుక్రవారం ధోల్​పూర్​ ప్రాంతంలో అత్యాచారం జరిగింది. నిందితుడు 18ఏళ్ల పరేష్​గా పోలీసులు గుర్తించారు. శనివారం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి: గ్రౌండ్​లో హిట్​ వికెట్... నెట్​లో ట్రోల్ టార్గెట్​

ABOUT THE AUTHOR

...view details