తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సంఝౌతా ఎక్స్​ప్రెస్​ రద్దుకు భారత్​ నిర్ణయం

సంఝౌతా ఎక్స్​ప్రెస్​ను రద్దు చేస్తున్నట్లు పాక్​ చేసిన ప్రకటనకు దీటుగా భారత్​ ప్రతిస్పందించింది. దిల్లీ-అటారీ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్​ప్రెస్​ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

By

Published : Aug 11, 2019, 7:57 PM IST

Updated : Sep 26, 2019, 4:37 PM IST

సంఝౌతా ఎక్స్​ప్రెస్​ రద్దుకు భారత్​ నిర్ణయం

దిల్లీ-అటారీ మధ్య నడిచే సంఝౌతా లింక్ ఎక్స్​ప్రెస్​ను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. పాకిస్థాన్ తన వైపు నుంచి సంఝౌతా ఎక్స్​ప్రెస్​ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల తరువాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.

"లాహోర్​ నుంచి అత్తారీల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్​ప్రెస్​ను రద్దు చేయాలని పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది. బదులుగా దిల్లీ-అత్తారీ మధ్య సంఝౌతా ఎక్స్​ప్రెస్​ను రద్దు చేశాం."

- దీపక్​ కుమార్​, ప్రధాన ప్రజాసంబంధాల అధికారి, ఉత్తర రైల్వే

ఆదివారం ప్రయాణం కోసం ఇద్దరు వ్యక్తులు సంఝౌతా ఎక్స్​ప్రెస్​ టికెట్లు బుక్​ చేసుకున్నారని రైల్వే అధికారులు తెలిపారు.

సంఝౌతా లింక్ ఎక్స్​ప్రెస్​

భారత్​లో సంఝౌతా ఎక్స్​ప్రెస్ దిల్లీ నుంచి అత్తారీకి నడిచేది. పాకిస్థాన్​... లాహోర్​ నుంచి అత్తారీకి సంఝౌతా ఎక్స్​ప్రెస్​ను నడిపేది. ప్రయాణికులు అత్తారీ స్టేషన్​లో రైళ్లు మారేవారు.

ఇదీ నేపథ్యం

జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్​, లద్ధాఖ్​ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఫలితంగా పాక్​-భారత్​ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ ప్రతీకార చర్యగా సంఝౌతా ఎక్స్​ప్రెస్, థార్​ ఎక్స్​ప్రెస్​లను నిలిపివేసింది.

ఇదీ చూడండి: ఆగస్ట్​ 15లోగా 2కోట్ల మందికి కిసాన్ మాన్​ధన్​

Last Updated : Sep 26, 2019, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details