దిల్లీ-అటారీ మధ్య నడిచే సంఝౌతా లింక్ ఎక్స్ప్రెస్ను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. పాకిస్థాన్ తన వైపు నుంచి సంఝౌతా ఎక్స్ప్రెస్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల తరువాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.
"లాహోర్ నుంచి అత్తారీల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ప్రెస్ను రద్దు చేయాలని పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది. బదులుగా దిల్లీ-అత్తారీ మధ్య సంఝౌతా ఎక్స్ప్రెస్ను రద్దు చేశాం."
- దీపక్ కుమార్, ప్రధాన ప్రజాసంబంధాల అధికారి, ఉత్తర రైల్వే
ఆదివారం ప్రయాణం కోసం ఇద్దరు వ్యక్తులు సంఝౌతా ఎక్స్ప్రెస్ టికెట్లు బుక్ చేసుకున్నారని రైల్వే అధికారులు తెలిపారు.