ఆర్బీఐ అనుమతులు లేక రాష్ట్రాల్లో రుణమాఫీ సాధ్యం కావటం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఫలితంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేరళలోని వాయనాడ్లో రైతుల పరిస్థితిని ఉదహరించి కేంద్రంపై విమర్శలు గుప్పించారు రాహుల్.
"దేశంలో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది. కేరళలో రైతుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నా. ఒక్క వాయనాడ్లోనే 8వేల మంది రైతులు రుణాలు చెల్లించాల్సి ఉంది. అప్పు చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నాయి. ఆస్తులు జప్తు చేస్తున్నాయి. ఇదే అక్కడ ఆత్మహత్యలకు కారణమవుతోంది. కేరళ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని అంగీకరించాలని ఆర్బీఐకి కేంద్రం సూచించాలని నా విజ్ఞప్తి.
ఈ 5 ఏళ్లలో వ్యాపార వేత్తలకు 4.3 లక్షల కోట్లు పన్ను రాయితీలు, 5.5 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసింది. ఎందుకు ఈ రెండు నాలుకల ధోరణి. రైతుల వృద్ధికి సంబంధించి ఈ బడ్జెట్లో ఎలాంటి దృఢమైన నిర్ణయం తీసుకోకపోవటం బాధాకరం."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు