తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళ విపత్తు: చనిపోతున్నా చేయి వదలని తల్లి

కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మలప్పురంలోని కొట్టకున్నులో శనివారం ఓ కుటుంబం వరదల్లో కొట్టుకుపోయింది. ఆదివారం కుటుంబంలోని తల్లి, కుమారుల మృతదేహాలు బయటపడ్డాయి. చనిపోతున్నా కుమారుడి చేయి వదలకుండా పట్టుకున్న ఆ తల్లి ప్రేమను చూసి స్థానికుల హృదయాలు ధ్రవించాయి.

By

Published : Aug 12, 2019, 6:09 PM IST

Updated : Sep 26, 2019, 6:54 PM IST

కేరళ విపత్తు: చనిపోతున్నా చేయి వదలని తల్లి

కేరళ మలప్పురం ప్రాంతం కొట్టకున్నులో కొండ చరియలు విరిగిపడి, ప్రాణం పోయినా కుమారుడి చెయ్యి వదల్లేదు ఓ తల్లి.

మలప్పురంలోని కొట్టకన్ను ప్రాంతం కొండలపై ఉంటుంది. ఇక్కడే నివాసముంటున్నారు గీతూ, శరత్ దంపతులు. శనివారం ఒక్కసారిగా వరద వచ్చి, కొండ చరియలు విరిగిపడగా... శరత్ సహా తల్లి సరోజిని, భార్య గీతూ, కుమారుడు ధ్రువ్ కొట్టుకుపోయారు.

ఆదివారం సహాయక సిబ్బంది చేసిన ఆపరేషన్​లో బురద కింద 21 ఏళ్ల గీతూ, ఏడాదిన్నర వయస్సుండే ధ్రువ్ మృతదేహాలు బయటపడ్డాయి. మరణంలోనూ తన కుమారుడి చేతిని వదలకుండా గీతూ పట్టుకుని ఉన్న దృశ్యాలు చూసి స్థానికులు చలించిపోయారు.

సోమవారం శరత్ తల్లి సరోజిని మృతదేహం బయటపడింది. కుటుంబాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాడు అతడు.

ఇదీ చూడండి: రాజకీయ 'దంగల్'​లోకి ఫొగట్​ కుటుంబం

Last Updated : Sep 26, 2019, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details