తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ఫోన్​

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. పాక్​లో హింస, తీవ్రవాదాన్ని నిర్మూలించి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని ఇమ్రాన్​కు సూచించారు మోదీ.

By

Published : May 26, 2019, 7:26 PM IST

Updated : May 26, 2019, 11:04 PM IST

మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్​ ఫోన్​

మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ఫోన్​

ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్​లో సంభాషించారు పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. ఇరు దేశాల అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు మోదీకి తెలిపారు​. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు చెప్పారు.

ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలంటే పాక్​లో హింస, తీవ్రవాదాన్ని నిర్మూలించి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ఇమ్రాన్​కు సుచించారు మోదీ.

ఫోన్​ చేసి శుభాకాంక్షలు చెప్పినందుకు ఇమ్రాన్​కు ధన్యవాదాలు తెలిపారు.

భాజపా చారిత్రక విజయం సాధించినందుకు మాల్దీవుల మాజీ ప్రధాని మహమద్​ నషీద్​, నేపాల్ మాజీ ప్రధాని మాధవ్​ నేపాల్​లు మోదీకి ఫోన్​ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి: ఈ నెల 30న నరేంద్రుని ప్రమాణ స్వీకారం

Last Updated : May 26, 2019, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details