ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో సంభాషించారు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఇరు దేశాల అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు మోదీకి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు చెప్పారు.
ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలంటే పాక్లో హింస, తీవ్రవాదాన్ని నిర్మూలించి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ఇమ్రాన్కు సుచించారు మోదీ.