తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరెంట్ తీగల చోరీకి యత్నం- షాక్​తో నలుగురి మృతి

చోరీ చేయడం అంత సులభమేమీ కాదని నిరూపించింది మధ్యప్రదేశ్​లో జరిగిన ఓ ఘటన. బనారసీ గ్రామంలో విద్యుత్​తీగల చోరీకి యత్నిస్తూ... కరెంట్ షాక్​ తగిలి నలుగురు దొంగలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

By

Published : Sep 9, 2019, 10:18 AM IST

Updated : Sep 29, 2019, 11:14 PM IST

కరెంట్ తీగల చోరీకి యత్నిస్తూ నలుగురి మృతి

సునాయాసంగా బతికేయాలన్న నలుగురి ఆలోచన వారి ప్రాణాలు తీసింది. మధ్యప్రదేశ్​లో టీక్​మగఢ్​ జిల్లా బనారసీ గ్రామానికి చెందిన నలుగురు దొంగలు... కరెంట్ తీగల చోరీకి యత్నించి మరణించారు.

టీక్​మ గఢ్​ జిల్లా మోహన్ గఢ్ పరిధిలోని బనారసీ గ్రామంలో నలుగురు దొంగలు కరెంట్ తీగలను చోరీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో... కరెంట్ స్తంభం ఎక్కి తీగలను కట్ చేయడం ప్రారంభించారు. అనుకోకుండా కరెంట్ వచ్చింది. షాక్ తగిలిన నలుగురు దొంగలు... అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: దేశంలో ఈ ప్రాంతాలు చాలా 'ఖరీదు'​ గురూ!

Last Updated : Sep 29, 2019, 11:14 PM IST

ABOUT THE AUTHOR

...view details