కేరళలోని పలు దేవాలయాల్లో పండగైతే 'చెరుపుళ్లస్సెరి పార్థన్' అనే ఏనుగుదే ప్రధాన ఆకర్షణ. ఊరేగింపుల్లో చురుకుగా పాల్గొనేది. ఊరేగింపులో ఉత్సవ విగ్రహాన్ని రాజసంగా మోసేది అందరూ యువరాజుగా పిలిచే పార్థన్. శక్తి ఉన్నంతకాలం వల్లువనాడ్ పరిసర ప్రాంతాల్లోని ఆలయల్లో సేవలే పార్థన్కు పరమావధి.
44 ఏళ్ల నిండు వయస్సులో పార్థన్ కన్నుమూసింది. ఈ ఏడాది త్రిశూర్పురం ఆలయ ఉత్సవాల్లో కనిమంగళం శాస్త విగ్రహాన్ని పార్థన్ మోయాల్సి ఉంది. కానీ పార్థన్ మృతితో అక్కడివారు బాధపడ్డారు.