'పరువు' కేసులు: శశికి బెయిల్- కేజ్రీకి సమన్లు రాజకీయ నేతలు వివిధ సందర్భాల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులపై విచారణ చేపట్టింది దిల్లీ కోర్టు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్కు బెయిల్ మంజూరు చేసింది. రూ. 20 వేల పూచీకత్తుపై థరూర్కు బెయిల్ ఇచ్చింది.
థరూర్ వ్యాఖ్యలు మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని భాజపా దిల్లీ నాయకుడు రాజీవ్ బబ్బర్ పిటిషన్ దాఖలు చేశారు.
కేజ్రీవాల్కు సమన్లు..
దిల్లీలోని ఓటర్ల జాబితాలో పేర్లు అక్రమంగా తొలగించారన్న వ్యాఖ్యలపై భాజపా దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ చేపట్టింది కోర్టు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అతిశి, సుశీల్ కుమార్ గుప్తా, మనోజ్ కుమార్కు రూ. 10 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. ఈ నెల 16న హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది.
ఇదీ చూడండి:భానుడి భగభగలు- గణేశుడికీ చెమటలు!