తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"యువత, రైతులే 'చౌకీదార్​ చోర్​హై' సృష్టికర్తలు"

"చౌకీదార్​ చోర్​ హై".... కాంగ్రెస్​ ప్రచార నినాదం, ప్రధాని మోదీపై ప్రధాన విమర్శనాస్త్రం. సుప్రీంకోర్టుకు రాహుల్​ బేషరతు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఆ నినాదం కారణంగానే. అలాంటి పదబంధం వెనుక ఉన్న కథను వెల్లడించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు.

By

Published : May 8, 2019, 6:19 PM IST

Updated : May 8, 2019, 10:54 PM IST

యువత, రైతులే 'చౌకీదార్​ చోర్​హై' సృష్టికర్తలు

యువత, రైతులే 'చౌకీదార్​ చోర్​హై' సృష్టికర్తలు

కాంగ్రెస్ ప్రధాన ప్రచార నినాదంగా ఉన్న 'చౌకీదార్​ చోర్​హై' పదబంధాన్ని సృష్టించింది తాను కాదని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ వెల్లడించారు. ఆ నినాదానికి సృష్టికర్తలు రైతులు, యువతేనని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్​ భిండ్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాహుల్.

"ఓ రోజు ఛత్తీస్​గఢ్​లో సభ నిర్వహిస్తుండగా ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు, 2కోట్ల ఉద్యోగాల కల్పన వంటి చౌకీదార్​ ఇచ్చిన హామీలను ప్రస్తావించాను. అక్కడున్న రైతులు, యువత సమూహంలోని కొంత మంది 'చోర్ ​హై' అని గట్టిగా అరిచారు. అప్పటి నుంచే 'చౌకీదార్​ చోర్​ హై' నినాదం ప్రచారంలోకి వచ్చింది" అని వివరించారు రాహుల్​.

'చౌకీదార్ చోర్​హై' వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు బేషరతు క్షమాణలు చెప్పిన రోజే రాహుల్​ అదే అంశాన్ని ప్రచారంలో ప్రస్తావించారు.

పేదలకు ఏటా రూ.72 వేలు ఆర్థిక సాయం అందించే న్యాయ్​ పథకంతో దేశ అర్థికాభిృద్ధి మెరుగుపడుతుందని రాహుల్​ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే రుణాలు చెల్లించని కారణంగా రైతులను జైలుకు వెళ్లనివ్వమని పునరుద్ఘాటించారు.

ఇదీ చూడండి:'మేమొస్తే జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్​, డీజిల్'​

Last Updated : May 8, 2019, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details