తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అక్కడ రెండు నెలల్లోనే 48 బాల్య వివాహాలు!

కర్ణాటకలోని బళ్లారి, విజయనగర జిల్లాలో మహమ్మారి కాలంలోనే దాదాపు 240 బాల్య వివాహాలు జరిగాయి. కేవలం గత రెండు నెలల్లోనే 48 బాల్య వివాహాలు జరగడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది.

By

Published : Jun 2, 2021, 5:53 AM IST

child marriages in lock down
మహమ్మారి కాలంలో కర్ణాటకలో బాల్య వివాహాలు

కర్ణాటకలోని బళ్లారి, విజయనగర జిల్లాలో గత రెండు నెలల్లోనే 48 బాల్య వివాహాలు జరిగాయి. కరోనాతో లాక్​డౌన్​ కారణంగా ఈ ఘటనలు మరింతగా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఏప్రిల్​లో 36 బాల్య వివాహాలు జరగగా.. మేలో 12 జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తంగా మహమ్మారి కాలంలో 240 బాల్య వివాహాలు జరిగాయని వెల్లడించాయి. కానీ కేవలం ముగ్గురిపై మాత్రమే కేసులు నమోదయ్యాయని స్త్రీ శిశు సంక్షేమ శాఖ తెలిపింది. గత ఏడాది విధించిన లాక్​డౌన్​లోనూ భారీ సంఖ్యలో బాల్య వివాహాలు జరిగాయని వెల్లడించింది.

కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వ వర్గాలు ప్రస్తుతం నిమగ్నమవుతుండగా.. బాల్య వివాహాలు వెలుగులోకి రాకుండా పోతున్నాయని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇదీ చదవండి:నదిలో మృతదేహాలు- పీక్కు తింటున్న కుక్కలు!

ABOUT THE AUTHOR

...view details