పొలతల క్షేత్రంలో శివరాత్రి వైభవం
కడప జిల్లాలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కమలాపురంలోని పెండ్లిమర్రి మండలం పొలతల క్షేత్రంలో స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు. ఉదయం చండీయాగం, అనంతరం కళ్యాణోత్సవం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి తన కుటుంబంతో సహా శివయ్యను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కడప ఎస్పీ అంబురాజన్ స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
TAGGED:
sivaratri celebrations