వైభవంగా శ్రీవారి రథసప్తమి వేడుకలు - satavahana seva
తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం ప్రత్యేక హారతులు, నైవేద్యాలు సమర్పించిన అర్చకులు.. స్వామివారి వాహన సేవలను ప్రారంభించారు. ఒకేరోజున ఏడు వాహన సేవలు దర్శించుకునే అవకాశం ఉన్నందున పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో తిరుమాడవీధులు నిండిపోయాయి. శ్రీవారిని సర్మించుకుంటున్నారు.