Pratidhwani: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం వల్ల లాభనష్టాలు ఏమిటి ? - PRATIDHWANI OVER DECISION TO INSTALL METERS FOR AGRICULTURAL PUMPSETS
రాష్ట్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అన్నింటికీ మీటర్లు అని ప్రకటించారు ముఖ్యమంత్రి. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం మెరుగైన సేవలకు ఇది తప్పనిసరి అంటున్నారు సీఎం జగన్. కాదు..ఉచిత విద్యుత్కు ఉరి.. వ్యవసాయ రంగానికి తీరని చేటు అంటున్నాయి రైతుసంఘాలు. ఇదే సమయంలో.. బిల్లులు మేమే చెల్లిస్తాం.. ఆందోళన అక్కర్లేదు అంటున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యక్ష నగదు బదిలీ హామీని విశ్వసించేది ఎలా? అన్న ప్రశ్నలూ బలంగా వినిపిస్తున్నాయి. ఉన్న ఉచితవిద్యుత్ను యధాతథంగా కొనసాగించేటప్పుడు ఇంత ప్రక్రియ దేనికి? సాగుకు మీటర్లు బిగించడం వల్ల లాభనష్టాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.