ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 29, 2020, 9:09 PM IST

ETV Bharat / videos

ప్రతిధ్వని: చైనాను కలవరపెడుతోన్న భారత్ - అమెరికా మైత్రి

భారత్​, అమెరికా మధ్య కుదిరిన బెకా ఒప్పందం చైనాను తీవ్రంగా కలవర పెడుతోంది. సార్వభౌమత్వం, స్వేచ్ఛను కాపాడుకునేందుకు భారత్​కు నిరంతరం అండగా ఉంటామని అమెరికా ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్​ అత్యంత వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. అటు అమెరికా సైతం చైనాను కట్టడి చేసేందుకు మన దేశంతోపాటుగా బంగ్లాదేశ్​, శ్రీలంక, మాల్దీవులను కలుపుకుని వెళ్లాలని ప్రయత్నం చేస్తోంది. ఇంకో వైపు క్వాడ్​ కూటమి చైనాపై కత్తి దూసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత వ్యూహాలకు చైనా చక్ర బృందంలో చిక్కుకుంటుందా? చైనా దుశ్చర్యలను అమెరికా అండతో భారత్​ ఏ విధంగా నిలవరించబోతుంది? లాంటి అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

...view details