చిత్రలేఖనంలో ఆంగ్ల ఉపాధ్యాయురాలి నైపుణ్యం - beautiful paintings by a teacher in east godavari dst thuni
తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన రాజ్యలక్ష్మి వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైనా చిత్రలేఖనంలోనూ రాణిస్తున్నారు. పట్ణణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ఈమె విద్యార్థులకు చిత్రలేఖనంలో తర్ఫీదు ఇస్తున్నారు. రాజ్యలక్ష్మీ వేసిన చిత్రాలు చూస్తే ఎవరైనా ఔరా అనక మానరు.