ప్రత్యేక అలంకరణలో వాడపల్లి వెంకటేశ్వరుడు - vadapalli venkateshwaraswamy temple
పులిహోర, గారెలు, పువ్వులతో గీసిన వెంకటేశ్వర స్వామి చిత్రం భక్తులను ఎంతగనో ఆకట్టుకుంది. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. స్వామి వారి తిరుప్పావడ సేవ కార్యక్రమాన్ని వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా చేసిన పులిహోరను స్వామి ఆకారంలో నేలపై వేసి, చుట్టూ గారెలు, ఎండి మిరపకాయలు, పువ్వులతో అందంగా అలంకరించారు.