ఐదేళ్ల తరువాత జలపాతం పరవళ్లు - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణం సమీపంలోని దుర్గం కొండపై నుంచి జాలువారుతూ.. సల్వా పేటు జలపాతం కనువిందు చేస్తోంది. నివర్ తుపాను ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురవటంతో దాదాపు 5 ఏళ్ల తర్వాత సల్వా పేటు జలపాతం పర్యటకులను అమితంగా ఆకర్షిస్తోంది. జలపాత సోయగాన్ని తిలకించేందుకు ఉదయగిరితో పాటు పరిసర ప్రాంతాల నుంచి సందర్శకులు దుర్గం కొండపైకి అధిక సంఖ్యలో వస్తున్నారు.